ధర్మవరంలో చిన్నారి అపహరణ జరిగిన ఘటన కలకలం రేపింది. ధర్మవరం పట్టణంలోని మారుతీనగర్లో రుషిత ప్రియ(7) అనే చిన్నారి గురువారం మధ్యాహ్నం అపహరణకు గురైంది. అనంతపురానికి చెందిన రామ్మోహన్, వసుంధర దంపతుల కుమార్తె రుషితప్రియ పాఠశాలకు సెలవు కావడంతో మారుతీనగర్లో ఉంటున్న తన అమమ్మ ఇంటికి వచ్చింది. సమీపంలోని ధర్మవరం గ్రామీణ పోలీసుస్టేషన్ క్రీడా మైదానంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఐస్క్రీం ఇస్తానంటూ ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో అక్కడున్న పిల్లలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు