వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఐరాస సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లినప్పుటి నుంచి ఆమె వరుస భేటీలతో ద్వైపాక్షిక, వాణిజ్య తదితర సంబంధాల బలోపేతంపై వివిధ దేశాధినేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బ్రెజిల్, సౌదీ అరేబియా, మెక్సికో, మొరాకో, సాన్మారినో, మల్దోవా ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సాన్మారినో ప్రధాని నికోలా రేంజ్తో భేటీ అనంతరం సౌదీ విదేశాంగమంత్రి అదెల్అల్జుబెర్తో ద్వైపాక్షిక, వాణిజ్య బంధాల బలోపేతంపై చర్చించారు. బ్రెజిల్ విదేశీ వ్యవహారాల మంత్రి ఫెరీరాతో విడిగా సమావేశమై ఇరుదేశాల బంధం బలోపేతంపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.