విజయవాడ: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చే బుధవారం తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీగా ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తాడిపత్రికి నీరు కూడా తీసుకురాలేకపోయినట్లు తెలిపారు. అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగిలాయని ఆరోపించారు. 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దయాదాక్షిణ్యాలపై బతకలేదని చెప్పారు. తాను ఈ పదవిలో కొనసాగలేనని.. వచ్చే బుధవారం రాజీనామా చేస్తానని చెప్పారు.