త్రాల్: జమ్మూకశ్మీర్లోని త్రాల్లో ఇవాళ ఉగ్రదాడి జరిగింది. పుల్వామా జిల్లాలోని త్రాల్లో ఉన్న సీఆర్పీఎఫ్ యూనిట్పై గ్రేనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు 20 మంది గాయపడ్డారు. జమ్మూకశ్మీర్ మంత్రి నహీమ్ అక్తర్ ఈ దాడి నుంచి ప్రాణాలతో తప్పించుకున్నారు. బిజీగా ఉండే బస్ స్టాండ్ వైపు ఉగ్రవాదులు రెండు గ్రేనేడ్లను విసిరారు. దాడి జరిగిన ప్రాంతాన్ని కర్డన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పారామిలిటరీ పోలీసులు ఉన్నారు. రాష్ట్ర మంత్రి నహీమ్ అక్తర్ ఓ ప్రాజెక్టు ప్రారంభం కోసం త్రాల్కు చేరుకున్న సమయంలో ఉగ్రవాదులు గ్రేనేడ్లతో దాడి చేశారు. ఉదయం 11.45 నిమిషాల సమయంలో గ్రేనేడ్లు విసిరినట్లు తెలుస్తున్నది. గ్రేనేడ్లు విసిరిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.