కర్నూలు: రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అధికార వికేంద్రీకరణే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలుచేస్తూ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దశాబ్దాల తరబడి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చుతూ 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచే ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కీలక ముందడుగు వేశారని ఆస్పరి వైసీపీ నాయకులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆదేశాలు మేరకు రెండవ రోజు ఆస్పరి మండల కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచనల రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటుకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఆస్పరి పట్టణంలో మహిళలు, వైస్సార్సీపీ నాయకులతో కలిసి గాంధీ పార్క్ నుండి అంబేద్కర్ సర్కల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చిన జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
కార్యక్రమంలో ఆస్పరి మండల కన్వీనర్ ఎస్. రామాంజనేయులు, జిల్లా సంయుక్త కార్యదర్శి కె. గోవర్ధన్, ఆలూరు మండల కన్వీనర్ వీరేష్, బసవరాజు, అశోక్ నాయుడు, తిమ్మప్ప, నగరుర్ పాండు, నాయుడు, శ్రీరాములు వీరేశ్ వర్మ, విజయ్, రాజశేఖర్ నాయుడు, రాజు, బాలరాజు, అంజి, ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa