ఆప్కాస్ (ఎపి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల పలు సమస్యలను పరిష్కరించేందుకు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
గురువారం 300 మంది, శుక్రవారం 350 మంది ఉద్యోగులు హాజరై తమ సమస్యలను పరిష్కరించుకున్నట్లు ఆయన తెలిపారు. చాలా మందికి పిఎఫ్, ఈఎస్ఐ జమ కాకపోవడం, ఈఎస్ఐ కార్డులు రాకపోవడం, జీతాలు పడకపోవడం వంటి సమస్యలు తమ దృష్టికి తీసుకురాగా, తమ సాంకేతిక బృందం వాటిని పరిష్కరించారన్నారు.
ఈఎస్ఐ కార్డుల కోసం 450 మంది దరఖాస్తులు అందజేయగా, 200 మందికి అప్పటికప్పుడే కార్డులు అందజేశామన్నారు. కార్యక్రమంలో సాంకేతిక బృంద సభ్యులు నజీర్, సుజిత్, రామ్ పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa