ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాట్‌ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచిన దక్షిణ మధ్యరైల్వే

Andhra Pradesh Telugu |   | Published : Thu, Sep 21, 2017, 10:05 AM

హైదరాబాద్ : దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్యరైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచింది. రూ.10 ఉన్న ధరను రూ.20కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 21 నుంచి ఆక్టోబర్ 3వ తేదీ వరకు అమల్లో ఉంటుందని దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు వీడ్కోలు ఇవ్వడానికి స్టేషన్‌కు బంధువులు, స్నేహితులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్లాట్‌ఫాం ధరలు పెంచితే అవసరమైన వ్యక్తులు మాత్రమే స్టేషన్‌లోకి వచ్చే అవకాశముందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మాత్రమే వర్తిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com