జమ్ముకశ్మీర్: హిజ్బుల్ మూజాహిదీన్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ భట్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో గల బిజ్బియారా రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. అహ్మద్భట్ సంచారంపై సమాచారం అందుకున్న అనంత్నాగ్ పోలీసులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. కాగా ఆర్మీ భద్రతా సిబ్బంది, అసోం పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో హెచ్ఎన్ఎల్సీ మిలిటెంట్ ఆర్గనైజేషన్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు అరస్టైన విషయం తెలిసిందే.