రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. దసరా పండుగ సందర్భంగా రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్బీ)ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కింద నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78రోజులవేతనాన్ని బోనస్గా ఇవ్వనున్నారు. పీఎల్బీ కింద నెలకు రూ.7వేలు నిర్ణయించారు. అంటే ఆయా ఉద్యోగులకు సుమారు రూ.17వేలు అదనంగా అందనున్నాయి. దీని ద్వారా దాదాపు 12.30లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
దసరా పండుగకు ముందే ఈ బోనస్ రైల్వే ఉద్యోగులకు అందుతుంది. దీని వల్ల కేంద్రంపై రూ.2,245.45కోట్ల మేర భారం పడనుంది. గతంలో 72రోజుల పీఎల్బీను మాత్రమే ఇచ్చేవారు. కానీ ఆరు సంవత్సరాల క్రితం నుంచి 78రోజుల బోనస్ను ఇస్తున్నట్లు ఆర్థిక శాఖఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.