పుదుద్చేరి: పుదుచ్చేరి ప్రభుత్వం ప్యాకింగ్కు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించింది. 51 మైక్రాన్లలోపుండే ప్లాస్టిక్ ప్యాకింగ్ కవర్ల తయారీ, వాడకంపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వర్షాకాల సమయంలో ప్లాస్టిక్ సరుకుల వినియోగంతో వివిధ ఆరోగ్య సమస్యలు వస్తుండటంతో..వాటిని నిషేధించాలని నిర్ణయించామని పుదుచ్చేరి పర్యావరణ, సంక్షేమ శాఖ మంత్రి ఎం కందసామి వెల్లడించారు. షాపు యజమానులు, ప్లాస్టిక్ తయారీదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని మంత్రి కందసామి కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ వాడకం చేస్తే జరిమానా వేయడం, వారిని విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు.