విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేశారు. మార్చి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే రూ.500 ఫైన్తో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా... మొత్తం 16 కేంద్రాల్లో ఆన్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఏయూ వీసీ ఈశ్వర్రావు, ఎంసెట్ కన్వీనర్ రంగనాథ్ తెలిపారు. ఏప్రిల్ 19న ఎంసెట్ పరీక్ష జరుగుతుందని వారు తెలిపారు.