ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్కు చెందిన కొంత మంది యువతులు దాదాపు 1500 మరుగుదొడ్లను నిర్మించారు. గత రెండు సంవత్సరాల నుంచి కలిసి కట్టుగా పని చేసి ఇప్పటి వరకు 1500 మరుగుదొడ్లను నిర్మించారని.. ప్రభుత్వ సహాయం ఏం లేకుండా 167 మరుగుదొడ్లను వాళ్లు నిర్మించినట్లు మున్సిపల్ కమిటీ కౌన్సిలర్ తెలిపారు. బహిరంగ మల, మూత్ర విసర్జనను అక్కడి ప్రాంతంలో లేకుండా చేయాలనే లక్ష్యంతోనే చొరవ తీసుకొని మరుగుదొడ్లను నిర్మించినట్లు యువతులు పేర్కొన్నారు. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆ అమ్మాయిలు అనుకోలేదు. అందుకే వాళ్లే పూనుకున్నారు. ఒకరికోసం ఎదురు చూడకుండా కలిసికట్టుగా మరుగుదొడ్లు నిర్మించి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.