5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి చేప | Suryaa News కాసులు కు కక్కురతి పడ్డ అవినీతి పరుడు ఏకంగా. రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయాడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో 5 లక్షలు తీసుకుంటున్న పెద్ద అవినీతి తిమింగలాన్ని ఏసిబి వల పన్ని పట్టుకుంది. విశాఖపట్నానికి చెందిన కార్తీకేయ కంస్ట్రక్షన్ కు చెందిన మేనేజర్ లీలా ప్రసాద్ అపార్ట్ మెంట్ నిర్మాణం నిమిత్తం శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఒక ఇసుక ర్యాంపు ను కేటాయించాలని థరఖాస్తు చేసుకున్నారు ... మైనింగ్ శాఖ లో అసిస్టెంట్ జీయోలజిస్టు (ఏ జి) గా పనిచేస్తున్న బుట్ట హనుమంతరావు 7 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. అయితే లీలా ప్రసాద్ అంత ఇచ్చుకోలేని 5 లక్షలు రూపాయలు ఇవ్వటానికి అంగీకరించారు. ఏసిబి ని ఆశ్రయించడంతో జిల్లా కేంద్రంలో ఉన్న బ్లూ ఎర్త్ హోటల్.. రూమ్ నెంబర్ 306 లో ఉన్నా హన్మంతరావు కు లీలా ప్రసాద్ 5 లక్షలు రూపాయలును ఇసుతుండగా ఏసిబి అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నామని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (CIU) డిఎస్పీ తెలిపారు