ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిని పర్యటిస్తున్న రాజమౌళి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2017, 12:33 PM

రెండు రోజుల అమరావతి పర్యటన నిమిత్తం ఈ ఉదయం విజయవాడకు వచ్చిన దర్శకుడు రాజమౌళి, ఉదయం చంద్రబాబుతో సమావేశం అనంతరం, అమరావతిలో ఇప్పటికే నిర్మితమైన భవనాలను సందర్శించేందుకు వెలగపూడి బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు కూడా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను రాజమౌళికి దగ్గరుండి చూపుతున్నారు. భవనాను త్వరగా నిర్మించేందుకు వాడిన సాంకేతికత, పెట్టిన ఖర్చు తదితర వివరాల గురించి రాజమౌళికి శ్రీధర్ వివరించారు. మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ అమరావతిలోనే గడపనున్న రాజమౌళి, భోజనం అనంతరం సీఎం చంద్రబాబుతో మరోసారి భేటీ కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com