ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి సమావేశమయ్యారు. హైదరాబాదు నుంచి అమరావతి వెళ్లిన రాజమౌళి నేరుగా సీఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిలో చేపట్టనున్న నిర్మాణాలు, వాటి ఆకృతులపై చర్చించారు. ఈ నెలాఖరులో ప్రభుత్వ ప్రతినిధులు, నిపుణులతో రాజమౌళిని లండన్ పంపనున్నారు. అక్కడ భారీ భవంతుల నిర్మాణాలు, కట్టడాలను పరిశీలించనున్నారు. కాగా, అమరావతిలో నిర్మించనున్న భవనాల రూపకల్పనలో రాజమౌళి సలహాలు ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి నారాయణ, సీఆర్డీఏ డైరెక్టర్ శ్రీధర్ లు హైదరాబాదులో రాజమౌళిని కలిసిన సంగతి తెలిసిందే.