ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2017, 08:30 AM

హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 69 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 861.30 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 111.0740 టీఎంసీలు. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 3 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌కు 14,321 క్యూసెక్కులు విడుదల చేశారు. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com