లక్నో : ఉత్తరప్రదేశ్లోని బుధాన్పూర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ట్రక్కు - ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.