అమరావతి: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నమోదు అవుతున్న జ్వరాల తీవ్రత, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలపై ఆయన వారితో చర్చించారు. చంద్రన్న సంచార వైద్యసేవలు, 108 సేవలు, నవజాత శిశు సంరక్షణపై మాట్లాడారు.