ప్రకాశం: జిల్లాలోని వేటపాలెం మండలం రామాపురం దగ్గర సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో మత్స్యకారుడు జాలయ్య నీటమునిగి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు ,బంధువులు కోరారు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు.