ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదువు చెప్పిన రోజా మేడం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2017, 04:46 PM

 నగరి ఎమ్మెల్యే రోజా కాసేపు జూనియర్ కాలేజీ విద్యార్థులతో సరదాగా గడిపారు. ఉపాధ్యాయురాలిగా మారి, వారికి మార్గ నిర్దేశం చేశారు. వివరాల్లోకి వెళ్తే, నగరిలోని ప్రభుత్వ మహిళల జూనియర్ కాలేజీకి శాశ్వత భవనాలను నిర్మించారు. ఈ నూతన భవనాలను  రోజా ప్రారంభించారు. అనంతరం ఓ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో ముచ్చటించారు. చాక్ పీస్ తీసుకుని, బ్లాక్ బోర్డుపై 'ఓం... కలలు కనండి.. సాకారం చేసుకోండి' అని రాశారు. ఆ తర్వాత విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com