భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంస్థలు ముందుకు రావాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ దూసుకుపోతోందన్నారు. ఈ ఏడాది భారత్ లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. గతేడాది కంటే 80శాతం అధికంగా జపాన్ నుంచి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయనేందుకు ఇది సంకేతమన్నారు ప్రధాని. భారత్- జపాన్ సంయుక్తంగా చేపట్టిన తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తుందన్నారు. ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.