ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌలాలంపూర్‌లో 25 మంది సజీవదహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 14, 2017, 09:59 AM

కౌలాలంపూర్‌: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నేడు జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన ఒక మత పాఠశాలలో చోటు చేసుకోవడంతో మృతుల్లో విద్యార్థులు, టీచర్లు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్‌ దాతుక్‌ కెర్మాట్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మృతుల్లో ఎక్కువమంది 5 నుంచి 18ఏళ్లలోపు వారే. ఈ ఘటనపై ప్రధాని నజీబ్‌ రజాక్‌ సంతాపం తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com