న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ మళ్లీ మెరిసింది. దాదాపు అయిదేళ్ల తర్వాత మళ్లీ వర్సిటీలో ఎన్ఎస్యూఐ హవా కొనసాగింది. విద్యార్థి సంఘాల ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ మూడు పోస్టులను చేజిక్కించుకున్నది. ఢిల్లీ వర్సిటీ విద్యార్థ సంఘం అధ్యక్షుడిగా రాకీ టుసీడ్ ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్గా కునాల్ షెరావత్, జాయింట్ సెక్రటరీగా అవినాశ్ యాదవ్లు ఎన్నికయ్యారు. ఏబీబీపికి చెందిన మహామేధా నగర్ సెక్రటరీ పోస్ట్ను గెలుచుకున్నాడు. అయితే ఎన్నికల సంఘం ఈ ఫలితాలను అధికారంగా వెల్లడించాల్సి ఉంది. వాస్తవానికి ఓట్ల కౌంటింగ్ ఆరంభంలో ఏబీవీపీ దూకుడుగా కనిపించింది. నాలుగు స్థానాల్లోనూ లీడింగ్లో కొనసాగింది. అయితే 11వ రౌండ్ తర్వాత సీన్ మారింది. మొత్తం 16 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ 12న జరిగిన ఎన్నికల్లో మొత్తం 43 శాతం విద్యార్థులు ఓటింగ్లో పాల్గొన్నారు.