కర్ణాటకలోని ఎల్లాపూర్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్రేన్ సహాయంతో కారును రోడ్డుపై నుంచి పక్కకు జరిపారు. ఈ రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.