నరసరావుపేట : మహాశివరాత్రి పర్వదినాన కోటప్ప కొండలో శుక్రవారం తిరునాళ్ళ అంగరంగ వైభవంగా నిర్వహిం చనున్నారు. దేశ వ్యాప్తంగా తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాంత వాసులు ఎంతో సంబరంగా జరుపుకునే ప్రభల పండుగ కూడా ఇదే. కొండ దిగువున తిరునాళ్ల తెల్లవార్లూ సాగుతుంది. విద్యుత్ కాంతులతో శోభిల్లే భారీ ప్రభలు కొండకు తరలి రానున్నాయి. నరసరా వుపేట పట్టణం, పరిసర ప్రాంతాల నుంచి సాధారణ ప్రభలు అధిక సంఖ్యలో తరలి వచ్చి కొండ దిగువున కొలువుదీరను న్నాయి. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వ శాఖలు నిమగ్నమ య్యాయి. ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి.