2016 మార్చిలో యెమన్లోని అడెన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేశారు. స్థానిక మిషనరీ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోకి ఉగ్రవాదులు చొరబడి 16 మందిని అతి దారుణంగా చంపేశారు. మరికొందరిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో టామ్ కూడా ఉన్నారు. ఇటీవల టామ్ సాయం కోసం అర్థిస్తున్న వీడియో ఒకటి స్థానిక మీడియాలో ఈ ఏడాది ప్రసారమైంది. ానా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. నేను వెంటనే చికిత్స తీసుకోవాలి. నాకు సాయం చేయండి్ణ అని ఆ వీడియోలో టామ్ అభ్యర్థించారు. అంతేగాక కిడ్నాపర్లు తమ డిమాండ్లను చెప్పేందుకు భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు టామ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. కాగా.. ఆయన కిడ్నాప్ అయినప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయన్ను విడిపించేందుకు ప్రయత్నాలు చేసింది. తాజాగా ఆయనను సురక్షితంగా విడిపించినట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు.