చిత్తూరు : పర్వతంపై భారత జెండాను ఎగురవేశారు. ఆమె ఇప్పటికే ఆసియాలోని 8,848 మీటర్లు ఉన్న మౌంట్ ఎవరెస్టు, ఆఫ్రికాలోని 5,895 మీటర్లు ఉన్న మౌంట్ కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని 2,228 మీటర్లు ఉన్న కౌస్స్యిజ్కో పర్వత శిఖరాలకు విజయవంతంగా చేరారు.8,848 మీటర్ల ఎవరెస్టును అధిరోహించిన మొదటి మహిళా పోలీసు అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక తాజాగా మౌంట్ ఎలబ్రస్ను అధిరోహించిన మొదటి భారతదేశం అధికారిణిగా రికార్డు సృష్టించారు. ఏడు ఖండాల్లో మిగిలిన మరో మూడు ఖండాల్లోని ఎతై్తన మూడు పర్వతాలనూ త్వరలోనే అధిరోహిస్తానని సోమవారం ఏఎస్పీ రాధిక న్యూస్టుడేకి అందించిన వాట్సాప్ సందేశంలో పేర్కొన్నారు.