నదులను రక్షించుకుందామంటూ తిరుపతిలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇషా షౌండేషన్ ఆధ్వర్యంలో టిటిడి కోదండరామస్వామి పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు నగర వీధులలో ర్యాలీ చేపట్టారు. జగ్గీ వాసుదేవ్ చేపట్టిన సేవ్ రివర్ ర్యాలీలో పర్యావరణ వేత్తలు, విద్యార్థినీ, విద్యార్థులు అందరూ పాల్గొనాలని ఇషా ఫౌండేషన్ తిరుపతి ఇన్ ఛార్జ్ సరస్వతి పిలుపునిచ్చారు.