ముంబై: డొమెస్టిక్ మొబైల్ బ్రాండ్ ఇంటెక్స్ తమ 4జీ స్మార్ట్ఫోన్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిలయెన్స్ జియోతో చేతులు కలిపిన ఇంటెక్స్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది. దీనికింద ఇంటెక్స్ 4జీ ఫోన్ యూజర్లు 25 జీబీ వరకు అదనపు డేటా వాడుకునే అవకాశం ఉంటుంది. రూ.309 అంతకన్నా ఎక్కువ రీచార్జ్ చేసుకుంటే.. ప్రతి రీచార్జ్కు 5 జీబీ అదనపు డేటా ఇంటెక్స్ మొబైల్ యూజర్లకు లభిస్తుంది. గరిష్ఠంగా ఐదు రీచార్జ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఇంటెక్స్, జియో యూజర్లకు ఎంతో సంతోషకరమైన వార్త అని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ అన్నారు.