రాజ్ తరుణ్ , అను ఇమ్మాన్యుయల్ హీరో,హీరోయిన్గా, ఎకె ఎంటర్టైన్మెంట్స బ్యానర్పై వంశీ కృష్ణ దర్శకత్వంలో, సుంకర రామబ్రహ్మం నిర్మాతగా నిర్మిస్తున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్బంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ 2016లో హిట్ అయిన చిత్రల్లో ఈడోరకం ఆడోరకం చిత్రం తరువాత ఎకె ఎంటర్ టైన్మెంట్స బ్యానర్లో రాజ్ తరుణ్ నటిస్తున్న మరో చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్రత్త. హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చితర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 3న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటి వరకు రాజ్ తరుణ్చేయని డిఫరెంట్ పాత్రలో నటించాడు. అనేక మలుపులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్సతో ఉన్న ఈ చిత్రం ట్రైలర్తో పాటు పాటలను విడుదల చేశాం. హంసనందిని నటించిన స్పెషల్ సాంగ్ నా పేరే సింగపూర్ సిరి మల్లి..సాంగ్ను నిన్ననే రిలీజ్ చేశాం. ప్రతి పాటలకు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్సాస్ రాబట్టుకుంది. మ్యూజిక్ చార్ట్సలో మందు వరుసలో నిలుచుకుంది. సాయి మాధవ్ గారి సంబాషణలు, రాజశేఖర్ సినిమా టోగ్రఫీ , ఎం ఆర్ వర్మ ఆర్ట వర్క ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయి. రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సొదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో నటించారు అన్నారు. రాజ్ తరుణ్ , అను ఇమ్మాన్యుయల్, నాగ బాబు, పృథ్వీ, రఘుబాబు, రాజా రావీంద్ర, త్రాగుబోతు రమేష్, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు. ఈ చిత్రానికి కథ శ్రీకాంత్, మాటలు సాయి మాధవ్ బుర్రా, ఎడిటర్ ఎం ఆర్ వర్మ, కెమెరా రాజశేఖర్, సహ నిర్మాత అజయ్ సుంకర, నిర్మాత రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం వంశీ కృష్ణ.