ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని'కి వైసీపీ కట్టుబడి ఉండాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 15, 2021, 01:43 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారము అమరావతినే రాజధానిగా చేయాలని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ తిక్కరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పెద్దకడబూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్వగృహం నుండి ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పురవీదుల గుండా ఎంపీడీవో ఆఫీసు వరకు సంఘీభావయాత్ర ర్యాలీ నిర్వహించారు.


ర్యాలీలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీలో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మానవాహారంగా ఏర్పడి అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళన చేపట్టారు.


ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ పాలన గతంలో తుగ్లక్ పాలనను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పాలనలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అమరావతే రాజదాని కొనసాగుతోందని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


అమరావతి రైతులకు మంత్రాలయం నియోజకవర్గం నుండి పూర్తి మద్దతు వుంటుందని వారు హామీ ఇచ్చారు. అలాగే ఓటీఎస్ కింద పైసలు ఎవ్వరూ కట్టవద్దని, రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గృహ నిర్మాణ లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో నాగేశ్వరరావుకు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa