అత్తవారింటికి వచ్చిన రెండు గంటల్లోనే అగ్నికి ఆహుతి అయిన గృహిణి విజయనగరం జిల్లా నెల్లిమర్ల లో దారుణం చోటు చేసుకుంది. అల బాన వీధికి చెందిన రాజేశ్వరి పెళ్లి అయిన 6నెలలకే అగ్నికి ఆహుతి అయ్యింది. కన్నవారి ఇంటి నుంచి అత్తవారింటికి వచ్చిన రెండు గంటలలోపే మంటల్లో చిక్కుకుని మసి అయిపోయింది. అలబాన వీధికి చెందిన కారుకొండ రామారావుకు చీపురుపల్లికి చెందిన రాజేశ్వరితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైనది.
వివాహం అయిన మూడు నెలల వరకు సజావుగా సాగిన వీరి కాపురంలో కలహాలు చోటు చేసుకున్నాయి. రాజేశ్వరి ఎక్కువగా కన్నవారింటికి వెళ్తుండటంతో అత్తింటివారు అనుమానం పెంచుకున్నారని మృతురాలి బంధువులు చెప్తున్నారు. దీంతో నిత్యం అత్తమామలు, భర్తతో గొడవలు పడుతుందేవరని తెలిసింది. అయితే అత్తింటివారే తమ కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు అత్తింటివేధింపులు భరించలేక రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుందా లేక అత్తింటివారే నిప్పటించారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు