నంద్యాల: తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఈనెల 23న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 14 టేబుళ్లపై 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రౌండ్ల వారీగా మెజార్టీని తెలిపేందుకు కౌంటింగ్ కేంద్రం ఎదుటనే పెద్ద ఎల్ఈడీ తెరను ఏర్పాటుచేశారు. మొదట నంద్యాల గ్రామీణంతో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఉదయం 10.30-11.00 గంటల మధ్య పూర్తి ఫలితం వెల్లడవుతుందని అధికారులు చెబుతున్నారు.
గోస్పాడులో అత్యధికంగా 90.81శాతం పోలింగ్ నమోదు కావడంతో ఇది ఏ పార్టీకి కలిసొస్తుందనే దానిపై తెదేపా, వైకాపా అంచనా వేస్తున్నాయి. నంద్యాల నియోజకవర్గంలో 79.20 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.