కోల్కతా : జీఎన్ఎల్ఎఫ్ చీఫ్ (గోర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్) మన్ ఘైసింగ్ పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీకి లేఖ రాశారు. డార్జిలింగ్లో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించాలని మన్ ఘైసింగ్ సీఎంకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. డార్జిలింగ్ హిల్స్ ఏరియాలో ప్రస్తుతమున్న సమస్యల పరిష్కారం దిశగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం మమత బెనర్జీని ఆయన లేఖలో కోరారు. లేఖపై స్పందించిన మమతా బెనర్జీ ఈ నెల 29న నబన్నా (తాత్కాలిక సచివాలయ భవనం)లో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ జీజెఎం (గోర్ఖా జనముక్థి మోర్చా) గత 67 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.