క్రీడారంగంలో విశేష సేవలు చేసిన వారికి, ఉత్తమ విజయాలు సాధించిన వారికి ఇచ్చే అవార్డులను 2017 సంవత్సరానికి సంబంధించి కేంద్రం వెల్లడించింది. ఇద్దరికి రాజీవ్ ఖేల్ రత్న, ముగ్గురికి ధ్యాన్ చంద్, ఏడుగురికి ద్రోణాచార్య, 17 మందికి అర్జున అవార్డులను ప్రకటించింది.
రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్- పారా అథ్లెట్ దేవేంద్ర ఝఝారియా, హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్
ధ్యాన్ చంద్ అవార్డ్- భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్), సుమరై టెట్(హాకీ), సయ్యద్ షాహిద్ హకీం(ఫుట్ బాల్)
ద్రోణాచార్య అవార్డ్– రోషన్ లాల్ (రెజ్లింగ్), డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్-మరణానంతరం), హీరానంద్ కటారియా (కబడ్డీ), జీఎస్ఎస్వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), పీఏ రాఫెల్(హాకీ), బ్రిజ్ భూషణ్ మహంతి(బాక్సింగ్)
అర్జున అవార్డ్- చటేశ్వర్ పుజారా(క్రికెట్), హర్మన్ ప్రీత్ కౌర్ (మహిళా క్రికెటర్), గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా, టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని, పారా అథ్లెట్స్ మరియప్పన్, వరుణ్ సింగ్ భాటి, వీజే సురేఖ(ఆర్చరీ), అథ్లెట్స్ ఖుష్బీర్ కౌర్, అరోకియా రాజీవ్.