ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిల్పా సహకార మార్కెట్‌ వద్ద ఉద్రిక్తత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 02:36 PM

నంద్యాల : నంద్యాలలోని శిల్పా సహకార మార్కెట్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శిల్పా స్టోర్‌లో స్థానికులకు నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు తెలియడంతో అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు తనిఖీలు చేపట్టగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తక్కువ ధరలకు సరుకులు అందిస్తున్నారని నిర్థారణ కావడంతో అధికారులు శిల్పా స్టోర్‌ను మూసివేయించారు.


శిల్పా ఫ్యామిలీ నిర్వహిస్తున్న శిల్పా సహకార్ మార్కెట్‌లో తక్కువ ధరకే స్థానికులుకు సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు స్టార్‌కు క్యూ కట్టారు. ఎక్కువ మంది జనాలు గుమికూడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు ఎన్నికల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ తక్కువ ధరలకే సరుకులు అందిస్తున్నారని అధికారులు నిర్దారణకు వచ్చారు. దీంతో శిల్పా సహకార్ సిబ్బందిని బయటికి పంపించి స్టోర్‌కు అధికారులు, పోలీసులు బలవంతంగా తాళాలు వేసినట్లుగా తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com