గుంటూరు : ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తాడికొండలో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి గ్రామీణ ఆరోగ్య కేంద్రం, శిక్షణ కేంద్రం భవనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాతిమా వైద్య కళాశాల విషయంలో కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే నీట్కు సంబంధించి 371డి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే ఈ విషయంపై కూడా తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని మంత్రి తెలిపారు.