గుంటూరు : కేంద్రమంత్రి జేపీ నడ్డా గ్రామీణ ఆరోగ్య కేంద్రం,శిక్షణ కేంద్రం భవనాలను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంత వైద్యులకు క్షేత్రస్థాయి అనుభవం కోసం ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లుగా కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. తాడికొండలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం, శిక్షణ కేంద్రం భవనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఎయిమ్స్ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు అనుబంధంగా ఆర్హెచ్టీసీ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు.