ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైకాపాకు ఓటమి తప్పదు : ప్రత్తిపాటి పుల్లారావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 01:51 PM

అమరావతి : నంద్యాల ఉప ఎన్నికలోను, కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైకాపాకు ఓటమి తప్పదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాలలో వైకాపా పని అయిపోయిందని, కాకినాడలో తుడిచిపెట్టుకుపోతుందని ఆయన చెప్పారు. నంద్యాలలో మెజారిటీ చూశాకా, కాకినాడలో వైకాపాకు ఏజెంట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. నంద్యాల, కాకినాడల ఫలితాల తరువాత 2019లో వైకాపాకు అభ్యర్థులు దొరకరని ప్రత్తిపాటి జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని మంత్రి చెప్పారు. చంద్రబాడు పడుతున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారని ఆయన అన్నారు. గడిచిన మూడేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com