-టీఆర్ఎస్ గూండాలతో అలజడులు సృష్టించేందుకు కు్ట్ర
-నాడు తెలంగాణ ఉద్యమ నేత కోదండరాం
-ఉప సంఘ విద్రోహిగా కనిపిస్తున్నారా?
-టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధి: మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ వాదులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి టీఆర్ఎస్ కేసీఆర్తో సహా అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రొ.కోదండరాం నేడు టీఆర్ఎస్ సర్కార్కు సంఘవిద్రోహశక్తిగా కన్పిస్తున్నా రా? అని తెలుగునాడు స్టూడెంట్ ఫోరం(టీఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూధన్రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులంటే కేసీఆర్కు భయమెందుకని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని నిలదీశారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంటే ఇందులో టీఆర్ఎస్ గుండాలతో, పోలీసులతో నిరుద్యోగ నిరసన ర్యాలీలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ర్యాలీలో అవాంతరాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే నిరుద్యోగుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ రాచరికపు పోకడలతో అణచివేత ధోరణిగా ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కోదండరాం ఆధ్వర్యంలో మిలియన్మార్, సాగరహారం, సకల జనుల సమ్మె చేసినప్పుడు..ఆయనతో కలిసి కేసీఆర్తో సహా ఇతర టీఆర్ఎస్ వేదికలు పంచుకున్నప్పుడు అప్పుడు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి, ప్రజల పక్షాన పోరాడే హక్కు ప్రజా సంఘాలకు, నాయకులకు ఉంటుందన్నారు. తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఇంటికో ఉద్యోగం ఇసా ్తమంటూ యువతను రెచ్చగొట్టారని, నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఎన్నికల మెనిఫెస్టోలో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయంటూ సీఎంతో సహా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుం డడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో లక్షా 7వేల ఉద్యోగాలు ఉంటే రెండున్నరేళ్ల కాలంలో 17వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని మధు వివరించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై, ఉద్యమ నాయకులపై లాఠీచార్జీ చేయించి, జైల్లో పెట్టించిన తెలంగాణ వ్యతిరేకులకు రాజకీయ ఉద్యోగాలు కట్టబెట్టి, స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన నిరుద్యోగు లకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారు రొడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి కల్పించారన్నారు. ఇప్పటికైనా 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగుల పట్ట కేసీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘటన తప్పదని మధు హెచ్చరించారు.