ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అణచివేస్తే ఉద్యమిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:23 PM

 -ఉద్యోగాలు భర్తీ చేయయంటే ఎందుకీ గోల!


 -సంక్షేమ భవన్‌ వద్ద ర్యాలీలు, ధర్నాలు నిషేధƒం


 -ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీసీ సంఘాలు 


హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాలరాస్తున్నది ప్రజాస్వామ్యంలో సమస్యలు పరిష్కరింపచేసేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకవచ్చేందుకు శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు చేసే హక్కుం దని, దీన్ని తెలంగాణ సర్కార్‌ అడ్డుకుంటున్నదని పలు బీసీ సంఘాలు ప్రభుత్వంపై కన్నెర్ర చేశాయి. తెలుగు సంక్షేమభవన్‌ వద్ద ధర్నాలు-ర్యాలీలు నిషేధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారంనాడు తెలంగాణ సచివాలయంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ర్యాగƒ  కృష్ణయ్య, బీసీ యువజననేత డాక్టర్‌ అరుణ్‌, తెలంగాణ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ బీసీ ప్రజా సమితీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జకృష్ణ, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు వై.సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ఈ విషయంపై రాష్ట్ర మంత్రులు సీఎంపై ఒత్తిడితీసుకోవాల్సిందిపోయి అవాకులు చవాకులు పేల్చుతూ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని కృష్ణయ్య ఆరోపించారు. నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేసేందుకు ముందుకు వచ్చిన కోదండరాంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామం్టటే పోలీసులు అనుమతులివ్వడంలేదని, సీఎం నిరంకుశ విధానాలు విడనాడాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమభవన్‌ వద్ద ధర్నాలు, ర్యాలీలు నిషేదిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ప్రజల ప్రాథమిక హక్కు హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, అమాయకులైన విద్యార్థులు, ప్రజలపై పీడీ కేసులు బనాయించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. 


మంత్రుల భజన!: ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు ఓ పక్క నినదిస్తుంటే మంత్రులు మాత్రం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఉద్యమాలెం దుకంటూ భజనచేస్తున్నారని ఆయన ఎద్దేవాచేశారు. ఇప్పటి వరకు ఎన్ని భర్తీచ ేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం అని ప్రకటించిందని, అసెంబీ ్లలో లక్షా 7వేల ఖాళీలున్నాయని ప్రకటించి, నెలరోజుల్లో భర్తీ చేస్తామని మంత్రి ఈటెల ప్రకటించారన్నారు. రెండేళ్లు అయినా అతీగతీ లేదన్నారు. మంత్రులు తమ పబ్బంగడుపుకునేందుకు గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఉద్యమాన్ని కించపరచడం మానుకోవాలన్నారు. ఈ కాలంలోనే మరో 30వేల మంది ఉద్యోగులు పదవీవిరమణ పొందారని, ఆ ఖాళీలు సైతం అలాగనే ఉన్నాయని వివరించారు. 31జిల్లాలు, మండలాలు, ఆర్డీవో కార్యాలయాలను పెంచారని, ఉద్యోగులు మాత్రం లేరన్నారు. విద్యుత్‌శాఖ, ఆర్టీసీ, ఇతర 40 ప్రభుత్వ రంగ సంస్థల్లో 50వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయన్నారు. గ్రూపు2, పోలీస్‌ కానిస్టేబుల్‌‌స, ఇంజనీర్లు, ఉద్యోగాలకు నామమాత్రంగా నోటిఫికేషన్‌జారీ చేసి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. అలాగే గ్రూపు-1లో 900, గ్రూపు-3లో 4వేలు, గ్రూపు-4లో 35వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయలేదన్నారు. దీనితో పాటు ఎయిడెడ్‌ స్కూళ్లు, కస్తూర్భా ఆదర్శ పాఠశాలల్లో 40వేల టీచర్‌పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. హాస్టళ్లలో వార్డెన్లులేరు. పాఠశాలల్లో విద్యార్థులు లేరన్నారు. హాస్టళ్లలో ఇద్దరు వర్క ర్లుంటే 200మందికి ఎలా వంటచేస్తా రన్నారు. దీంతోనే ఈ ప్రభుత్వానికి బడుగులపై ఏ పాటి ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిరంకుశ వైఖరికి స్వస్తి పలికి రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కుకు భంగం కలిగించొద్దని, అలాగే ధర్నాలు, నిరసనలను అడ్డుకోవద్దని అడ్డుకుంటే హెచ్చరిస్తామని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com