విజయవాడ, మేజర్న్యూస్: రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి వేల ఎకరాల భూమిని సేకరించి వివిధ కంపెనీలకు ధారదత్తం చేయడం అత్త సొమ్మ అల్లుడు దానం చేసిన్నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దెవా చేశారు. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ర్ట కార్యాలయంలో రాజధాని రైతు, రైతుకూలీల పరిరక్షణ కమిటీ సమావేశం రఘువీరారెడ్డి అధ్వర్యంలో జరిగింది. ఏడాదికి మూడు పంట పండే అరుదైన భూములు. సారవంతమైన భూములు రైతుల నుంచి రాజధాని నిర్మాణం పేరిట తీసుకుని ఎవరికి ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కాలేజీలకు ఇంత భూమి అని, యోగాకు ఇంత భూమి అని పరిశ్రమ అని కోట్లకు పడగలెత్తిన వారికి వంద ఎకరాల భూమిని అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని కమిటీ 29 గ్రామలల్లోని లక్ష 44వేల మంది రైతుల మనోభవాల అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పొరాడుతుందని సృష్టం చేశారు. రాజధానిలో నిరంతరం పోలీస్ రాజ్యంగా మారిందన్నారు. ఏపి రాజధానిలో ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు. రాజధానిలో 24/7 పోలీస్ 144, 30 సెక్షన్ నిరంతర అమలు ఏమిటి అని ప్రశ్నించారు. భూమలు ఇవ్వని వారిని బేదిరిస్తున్నారన్నారన్నారు. రైతు భూములకు ప్రభుత్వ ధర నిర్ణయించడం విడ్డురుంగా ఉందన్నారు. ఇక్కడ చట్టాలకు, రాజ్యంగానికి, దేనికి గౌరవం లేదన్నారు. తెలుగు దేశం ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి భూమి సేకరించి, వారికి ఇచ్చిన హామీలలో రైతులకు ఉచిత విద్య, ఉపాధి, అందరికీ వైద్యం అంటూ ఇచ్చిన హామీ లక్ష 44 వేల మందికి ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. అభివృద్ధి పేరిట నిర్మిస్తున్న రహాదారుల కారణంగా భూమి కొల్పొయిన రైతులకు పరిహారం అందలేదన్నారు. రాజధాని నిర్మాణానికి రైతు స్థలాలు ఇచ్చిన వేంటనే స్థలాల కెటాయిస్తా రన్నారు. స్థలాలు కెటాయించడమే కాదు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా రాజధాని నిర్మాణంలో ఎంత మంది ఉపాధి, విద్య, వైద్యం, అభివృద్దిపై ఎందుకు వివరాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం అతిధి గృహానికి కూతవేటు దూరంలో రోజు ఇసుక లారీలల్లో తరలిపొతుందన్నారు. టిడిపి పాలన పూర్తిగా దొపిడి, అవినీతి అన్నారు. రాజధాని రైతు, రైతుకూలీల పరిరక్షణ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రకటించారు. రాజధాని రైతులకు సీఎం ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదన్నారు. దీనిపై ఈ నెల 23న ఏపి సీఎం చంద్రబాబు ఉత్తరం రాయనున్నట్లు వివరించారు. రాష్ర్ట రాజధాని నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్చేశారు. రాజధానిలోని 29 గ్రామల్లోని రైతుల లక్ష 44వేల మంది హక్కులు కాపాడాలన్నారు. రాజధాని పోలీస్ సెక్షన్ 144, 30 పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. అందుకు అవసరమైతే న్యాయ పొరాటానికి సిద్దమన్నారు. రాజధాని నిర్మాణం చేతలకు భిన్నంగా ఉంద న్నారు. పూర్తి అవినీతి మయంగా జరుగుతుం దన్నారు. రాజధానిలో జరుగుతున్న అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తే అభివృద్ది నిరోధకలు అని ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.