అమరావతి : రాష్ట్రంలో పచ్చదనం కనుమరుగవడం ప్రమాదాన్ని సూచిస్తోందని స్పీకర్ కోడెల అన్నారు. విజయవాడలో నిర్వహించిన చెట్ల మార్పిడి జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దేశంలో పచ్చదనం 33 నుంచి 23 శాతానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో దేశ సగటు కన్నా 20 శాతం మాత్రమే తక్కువగా ఉందని, ఇకపై ప్రతిఒక్కరూ చెట్లను నరికే ముందు వాటిని తరలించే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చెట్లను తరలించే ప్రక్రియపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.