విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలోని కనకదుర్గ వారధి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు