స్వచ్ఛ భారత్పై కేంద్ర రక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తోంది. 2022 నాటికి దేశం నుంచి మురికిని తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అమల్లో భాగంగా ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం ఈ పోటీలు జరుపుతోంది. ‘స్వచ్ఛ్ సంకల్ప్ సే స్వచ్ఛ్ సంకల్ప్ సిద్ధి’ అనే నినాదం కింద సెప్టెంబరు 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ‘భారత్ను పరిశుభ్రంగా ఉంచడానికి నేనేమి చేయగలను?’ అనే అంశంపై వ్యాసరచన, ‘పరిశుభ్ర భారత్కు నా భాగస్వామ్యం ఏమిటి’ అనేదానిపై ఫిల్మ్, ‘నా కలల పరిశుభ్ర భారత్’పై చిత్రలేఖనం పోటీలు ఉంటాయి. విజేతలకు అక్టోబరు రెండో తేదీన జాతీయ స్వచ్ఛ భారత్ పురస్కారాలను బహూకరిస్తారు.