న్యూఢిల్లీ: ఇంజిన్లలో తలెత్తిన సమస్య కారణంగా 13 విమానాలను షెడ్లకే పరిమితం చేసింది ఇండిగో. దీంతో మొత్తం 84 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్బస్ ఎ320 నియో ఎయిర్క్రాఫ్ట్లోని ప్రాట్ అండ్ విట్నీ తయారుచేసిన ఇంజిన్లలో సమస్య తలెత్తింది. విమాన సర్వీసులు రద్దవడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను వేరే ఫ్లైట్స్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంజిన్లలో సమస్యల కారణంగా ఇండిగోతోపాటు గోఎయిర్ సంస్థకు కూడా ఎయిర్బస్ నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యమవుతున్నాయి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు చెందిన ఇండిగో ప్రతి రోజు ప్రతి పది మంది ఇండియన్ ప్యాసెంజర్స్లో నలుగురిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. రోజూ కొన్ని వందల విమాన సర్వీసులను ఆ సంస్థ నడుపుతున్నది. ఈ ఏడాది జూన్ 21 నుంచి జులై 3 మధ్య ఇండిగో మొత్తం 667 విమాన సర్వీసులను రద్దు చేసింది.