భోపాల్ : జనసంఘ్ వ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా భోపాల్ లో ఈ రోజు ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం ఇక్కడకు చేరుకున్న అమిత్ షాకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ బౌహాన్, భోపాల్ మేయర్ అలోక్ శర్మ తదితరులు స్వాగతం పలికారు. ఇక్కడి లాల్ ఘాటీ స్క్వేర్ వద్ద ఏర్పాటు చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మేయర్ అలోక్ శర్మ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.