న్యూఢిల్లీ : ఇందిరా గాంధీ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు భారీగా కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్ను కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నుంచి 4 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 40 కోట్ల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో ఒకరు టాంజనియా, మరొకరు నైజీరియా దేశస్తుడు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.