న్యూఢిల్లీ : ఢిల్లీలో నిర్వహించిన యువ పారిశ్రామికవేత్తల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. పద్మ అవార్డుల్లో తాము సంస్కరణలు తీసుకొచ్చామని మోదీ తెలిపారు. పద్మ అవార్డుల కోసం ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మన దేశంలో గతంలో పద్మ అవార్డులు ఎలా దక్కేవో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం ఎవరికీ తెలియని హీరోలు కూడా గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు దేశం కోసం ఎంతో కొంత తోడ్పాటు అందించాలని కోరారు. దేశాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశం కోసం యువతతో పాటు సీనియర్లు కలిసిమెలసి పని చేయాలని మోదీ సూచించారు. ప్రభుత్వంలో విధానాలు రూపకల్పన చేయగలిగే యువతతో నేడు సమావేశమయ్యానని మోదీ పేర్కొన్నారు.