న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు వద్ద పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. గురువారం ఉదయం 10.54 నిమిషాల సమయంలో ఢిల్లీ హైకోర్టును గంటలో పేల్చేస్తామని పోలీసు కంట్రోల్ రూమ్ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం హుటాహుటిన ఢిల్లీ హైకోర్టు వద్దకు చేరుకుంది. బాంబు స్కాడ్, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. అయితే ఈ బెదిరింపు ఫోన్ కాల్ ఉత్తిదే అని పోలీసులు తేల్చారు. ఢిల్లీలోని భజన్పురా నుంచి కాల్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ఫోన్ నెంబర్ మాత్రం యూపీకి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. ఫోన్ కాల్ వచ్చిన మరుక్షణం నుంచే ఆ ఫోన్ స్విచ్ఛాప్ వస్తుందని పోలీసులు తెలిపారు. 2011, సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు గేట్ వెలుపల జరిగిన పేలుడులో 11 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడిన విషయం విదితమే.